Search Criteria
Products meeting the search criteria
Korivi
వల్లూరు శివప్రసాద్ నాటక రచయితగా, నటుడూ, దర్శకుడిగా, ప్రయోక్తగా మాత్రమే కాదు, ఉత్తమ కథా రచయితగా కూడా లబ్ధ ప్రతిష్ఠులు - 'తాజ్మహల్', 'కురిసినమబ్బు', 'ముందేమేలుకో', 'నాగేటి చాలు' కథా సంపుటాలతో, కథక మిత్రులకు, పాఠకులకు మిక్కిలి ఆత్మీయుడు - వస్తువైవిధ్యంతో, వాస్తవికతా శిల్పంతో, సమకాలిక సామాజిక జీవితాన..
Rs.100.00 Rs.80.00
Pitta Kathalu
బాలల మానసిక వికాసానికి కథలు తల్లిదండ్రులు పిల్లల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ..
Rs.50.00
Tadigiri Potaraju Ka..
పీడితుల విలాపాగ్నుల్ని అక్షరీకరించిన మార్క్సిస్టు కథకుడు తాడిగిరి పోతరాజు. తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించిన రచయిత. పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమౌతు..
Rs.65.00
Tatalanati Kathalu
''తాతలనాటి కథలు'' అనే ఈ కథా సంపుటిలో కొంగ - రొట్టిముక్క, గాజుల బేరం, పులగం, నేయి, జీర్ణం, జీర్ణం వాతాపిజీర్ణం, గొర్రెలకాపరి తెలివి, రే చీకటి అల్లుడు, పీటలమ్మవారి కథ, ఒక మహాఇల్లాలు, దేవా దేవేషు, పాముమంత్రం, కాలమహిమ, పొద్దు తిరుగుడు పువ్వు, దంపతుల తెలివి అనే 13 కథలు ఉన్నాయి.పేజీలు : 40..
Rs.65.00
Himsadhvani
బాల్యం పైన నానాటికి అధిక మౌతున్న హింసను శక్తిమంతంగా ధ్వనించిన నాటిక హింసధ్వని బాలాలు కూడా సమాజంలో భాగం. వారికి మానవ హక్కులు వర్తిస్తాయి. అయితే వీటన్నిటినీ దురాశతో , స్వార్ధంతో విస్మరిస్తూ, కేవలం వారిని చదువుకూ, చాకిరి బలి చేస్తునారు. పెద్దలు మారుకులు , ర్యాంకులు మాత్రమ..
Rs.20.00
Kaluvakolanu Sadanan..
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామ..
Rs.60.00
Kathasravanthi - 3
వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేల సంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారి..
Rs.605.00
Sarada Sahityam
శారద (సుబ్రహ్మణ్యయ్యర్ నటరాజన్) తెలుగువాడు కాని తెలుగు రచయిత. ‘‘శారద’’ కలం పేరుతో రచనలు చేసిన ఎస్.నటరాజన్ తమిళుడు. పుదుక్కోటైలో 1925 ఫిబ్రవరిలో పుట్టాడు. తల్లి భాగీరథి, తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్. మాతృభాషగాని భాషమీద పట్టుసాధించి దిట్టమైన రచనలు చేశాడు. రచయితగా జీవించిన పదేళ్ల కాంలో వందకుపైగా కథలు..
Rs.225.00
Prabodha Geetalu
'వందేమాతరం' జాతీయోద్యమానికి, జాతీయగీతాలకు తొలిమెట్టు. భారతజాతికి మేల్కొలుపు అనదగిన గీతాన్ని రచించిన జాతీయ కవిబ్రహ్మ బంకించంద్ర చటర్జీ, తరువాత 'జనగణమణ' గీతం వర్తమాన జాతీయగీతం, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఎందరో తెలుగుకవులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని, జైళ్ళపాలయి, తెలుగుజాతిని ఉత్తేజపరుస..
Rs.60.00
Yedugudisela Palle
భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలతో సహా స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బి.సి., మహిళలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాయి. విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగుతూనే వున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో షెడ్యూల్ తెగలు, కులాల వారికి కేటాయించబడిన రిజర్వేషన్లు అనేక సామాజిక కారణాలు, వ్యవ..
Rs.70.00
Ravi Sastry Kathalu
''రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయవూ చెయ్యకూడదని నేను భావిస్తాను'' అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజాపంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి..
Rs.60.00
Prasidda Balala Nati..
'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు. తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల ..
Rs.280.00
25 Natikalu
శివప్రసాద్ సాహిత్యంలోకి మొదట కథా రచయితగా ప్రవేశించారు. చాలా కథలకు బహుమతులు గెలుచుకున్నారు. కథకుడిగా ప్రసిద్ధులైన తర్వాత నాటక రంగంలోకి అడుగు పెట్టారు. బహుశా నాటకరంగ మిత్రులు తమకో నాటకం రాసి పెట్టమని కోరినప్పుడే ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టి వుంటారు. స్వతహాగా, మౌలికంగా కథా రచయితగావడం చేత ఆయనకు యితివ..
Rs.400.00
Gopichand Kathalu
తెలుగు కథకు వస్తు నవ్యత, శిల్ప సౌష్టవాన్ని కలిగించి కథానిక సాహిత్య విస్తృత ప్రాచుర్యానికి తోడ్పడ్డ ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్. సజీవమైన భాష, సరళమైన శైలి, నిరాడంబరమైన శిల్పం, సూక్ష్మమైన మానసిక విశ్లేషణ, విప్లవాత్మకమైన భావసంపద, హేతుబద్ధమైన శాస్త్రీయవిజ్ఞానం, వ్యంగ్యాత్మకమైన వ్యాఖ్యానాలతో కూడిన..
Rs.60.00
Valluru Sivaprasad K..
మార్క్సిస్టు పరిశీలనతో అభ్యుదయ రచయితగా సంప్రదాయ యితివృత్తాలకు భిన్నంగా శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో నూతన చైతన్యాన్ని, ఆలోచనలను సమాజానికి కథారచన ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. దు:ఖాన్ని ఆశ్రయించినా ఆ దు:ఖకారణాలను అన్వేషిస్తూ దు:ఖ విముక్తిని కాంక్షిస్తూ కథారచన చేస్తున్న నాలుగవతరం కథా రచయిత. 30క..
Rs.60.00
Madhurantakam Narend..
మధురాంతకం నరేంద్ర కథలు లోకాన్ని ఎలా చూడాలో చెప్తాయి. వాస్తవికతకీ వాస్తవికత వెనుకవుండే వాస్తవాన్ని పరిశృలించటానికి తోడ్పడతాయి. అంతేగాక ఈ కథలు పాఠకుని మనో విస్తృతి పెరగడానికి దోహద పడతాయి. ఒక దార్శనికతనిచ్చే చూపునీ ఇస్తాయి. నరేంద్ర కథలు మనకెంతో రసానుభూతిని కలిగిస్తాయి. ఈ కథా సంపుటిలో నాలుగుకాళ్ల మండపం..
Rs.60.00
Attada Appalnaidu Ka..
కళ్ళముందు కనిపించే జన జీవితం అలా ఎందుకుందో, సమకాలీన స్తానిక సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షోభాల, సంఘర్షణల నేపథ్యంలో విమర్శకు పెట్టటం ఆయన కథా వస్తువు. ఉత్తరాంధ్ర ప్రాంతం కథాభూమిగా, ఉత్తరాంధ్ర సామాన్య జనం కథా నాయకులుగా వారి భాష, యాస, తన శైలిగా ఆవాహన చేసుకొని ఘనమైన ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వానికి మేలైన ప్..
Rs.60.00
K.Varalakshmi Kathal..
దాదాపు మూడు దశాబ్దాలుగా కథలు వ్రాస్తూ అయిదు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి వెలువరించిన వరలక్ష్మి పది కథల బంగారం ఈ పుస్తకం. వరలక్ష్మి కథలు ఎక్కువగా స్త్రీ కేంద్రకంగా వుంటాయి. అవికూడా మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి విద్యావంతులైన స్త్రీలు కాక సమాజపు అడుగు పొరలలో వుండి, జీవితంతో పోరాడుతున్న స్త్రీలు. వాళ్..
Rs.60.00
Bhushanam Kathalu
తొలి ఆధునిక తెలుగుకథ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిందంటే అంగీకరించని వాళ్లు గూడా తొలి సాయుధ ఆదివాసీ కథ ఉత్తరాంధ్రనుంచి వచ్చిందని అంగీకరిస్తారు. కేవలం సాహిత్యం కారణంగా ఆంగ్లేయుల పాలనలో జైలు పాలయిన కవి గరిమెళ్ల సత్యనారాయణ తర్వాత కాంగ్రేజుల పాలనలో సాహిత్యం కారణంగా జైలుపాలయిన ఉత్తరాంధ్ర రచయిత భూషణం. 'ఆదివాసీ జ..
Rs.60.00
Maa Gokhale Kathalu
గోఖలే కథల్లో ఉక్కడా గోఖలే కనబడరు. రచయితతో ప్రమేయం లేకుండా కథ తనదారిన తాను పోతుంది. పాత్రలు రచయిత తమ చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టు కాకుండా తమంత తాముగా ప్రవర్తిస్తాయి. పాత్రలు స్వయం వ్యక్తాలు కావటం గోఖలే కథల్లోని గొప్ప రచనాశిల్పం. స్వభావ వాదంలోని ఆహ్లాదకర పార్శ్వానికి, వాస్తవికతా వాదంలోని అనుకూల పార్..
Rs.60.00