భారత దేశంలో కుల సమస్యలపై ఒక శాస్ర్తీయ అవగాహనను రూపొందించుకోవడానికి, సరైన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుత సంకలనం దోహదపడుతుంది. దళితుల అభ్యున్నతి కోసం మహత్తర కృషిచేసిన బి.ఆర్. అంబేద్కర్, కమ్యూనిస్టు నేత బి.టి. రణదేవె రచనలతో పాటు, భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్స్కిస్టు) పొలిట్ బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి, బి.వి.రాఘవులు వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగ వ్యాసాలు దీనిలో ఉన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) 2006 దళిత సమస్యలపై నిర్వహించిన అఖిల భారత సదస్సు తీర్మానం కూడ జత చేయబడింది. |