Rs.40.00
Out Of Stock
-
+
సరైన అభివృద్ధి వ్యూహానికి గిరిజనుల జీవనాన్ని, వారి సాంస్కృతిక మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. డా|| విఎన్వికె శాస్త్రి రచించిన 'కొమురం భీం- ముందు, తర్వాత, ఇప్పుడు' అనే పుస్తకం ఎంతో సందర్భోచితమైనది, అత్యంత ప్రయోజనకరమైనది. ఆదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎనిమిది దశాబ్దాలుగా జరిగిన పరిణామాలను సవివరంగా తెలియచేస్తుంది. ఈ ఆదివాసుల ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు ఇది అద్దం పడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం వారికి అర్థవంతమైన సహాయాన్ని అందించే ప్రయత్నంలో ఎదురయ్యే ఇక్కట్లను కూడా వివరిస్తుంది. ఈ పుస్తకంలో వివరించిన 'మనుగడ కోసం పోరాటం' ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
- ఎంవిపిసి శాస్త్రి, ఐఏఎస్ (రిటైర్డ్)