Rs.150.00
In Stock
-
+
మహాభారతంలో కీలకఘట్టాల రసవత్కథనంతోపాటు,
''యక్ష ప్రశ్నలు, చమత్కార ప్రశ్నలు, పొడుపు కథలు కానే కాదు,
తాత్త్వికత వాటి హృదయం'' అని -
ధర్మవ్యాధుడి కథ ''మానవుడు ప్రాకృత స్థితి నుంచి
సంస్కృతీకరణ పొంది బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం'' అని -
సైంధవఘట్టంలో ''స్త్రీ సౌందర్యాన్ని ఎలా దర్శించాలో మానవుడు
ఇంకా నేర్వని విద్య'' అని -
సావిత్రి కథలో ''యముడు మహాతాత్త్విక విషయం'' అని -
కీచకవధలో ''కాముకతని, స్త్రీ పురుష సంబంధాల ప్రకృతి వికృతులని -
రాయబారం సమీక్షలో ''మానవనిర్మాణం కళని శ్రీకృష్ణుడు సాధించిన విధాన్ని -
ఇదే మార్గంలో అంబ దయనీయ కథ వంటి మరి కొన్నింటిని,
పాత్రల మానసిక అధ్యయనంతో రచయిత అక్షరీకరించారు.
మనస్సుని సంపన్నం చేసే ఉత్తమ గ్రంథం ఇది.
- మహీధర