Rs.450.00
In Stock
-
+
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడి తెలంగాణలోని బహుప్రాంతాలలో అణచివేతకు గురైన పీడిత రైతాంగాన్ని సుమారు 400 గ్రామాలలో విముక్తం చేయగలిగారు. ఈ లోగా భారతదేశం స్వాతంత్య్రం పొందింది. హైదరాబాదు పాలకుడు భారతదేశంలో విలీనానికి అంగీకరించలేదు. పోలీసు చర్య జరిగింది. ఆ విధంగా 1948లో హైదరాబాదు భారత సమాఖ్యలో విలీనమైంది.
మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడగా 1953లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాదు నాయకులతో విస్తృతచర్చలు, పెద్ద మనుషుల ఒప్పందంతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
ఈ ముఖ్యమైన పరిణామాలన్నీ ఈ సంపుటంలో చర్చకు వచ్చాయి.
Pages : 826